పండ్లు భోజనానికి ముందు తినాలా లేక భోజనం తరువాత?

పండ్లు తినాలని తెలుసు, తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.కాని ఎప్పుడు తినాలి? భోజనానికి ముందు తినాలా లేక భోజనం చేసిన తరువాత తినాలా అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న.కొంతమంది భోజనానికి ముందే తినాలి అని అంటారు, మరికొందరేమో భోజనం తరువాతే తినాలంటారు.ఇంతకి ఎప్పుడూ తినొచ్చు?

 When One Should Eat Fruits? Before Meal Or After Meal?-TeluguStop.com

అసలు ఫలం తినటానికి ఇది సరైన సమయం అనే సమయమే లేదు.అలాగే ఈ టైమ్ లో పండ్లు తినకూడదు అని వాదించటం కూడా దండగే.నిజానికి పండ్లను భోజనానికి ముందు తినొచ్చు, భోజనం తరువాత తినొచ్చు, భోజనంతోపాటే తినొచ్చు.

మరి భోజనం వేరుగా ఉంటుంది, పండ్లు వేరుగా ఉంటాయి, రెండూ ఓకేసారి తింటే జీర్ణక్రియపై అది ప్రభావం చూపదా అని మీకో డౌటు రావొచ్చు.మన కడుపులో రకరకాల ఆహారానికి రకరకాల డైజెస్డీవ్ ఎంజైమ్‌లు ఉంటాయి.

అందుకే, రెండు భిన్న రకాల ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది రాదు.దీని వెనుక చాలా సింపుల్ లాజిక్.

భోజనం చేసేటప్పుడు మనం అన్నంలో ఒకేరకమైన కూరని వాడట్లేదుగా, కాస్తంత కూరతో, కాస్తంత పచ్చడితో, కాస్తంత పెరుగుతో తింటుంటాం.

సో, మన ఆహారంలో ఎప్పుడూ ఒకే రకమైన న్యూట్రింట్స్ ఉండవు.

భిన్నమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి మన కడుపుకి ఉంటుంది.అందుకే, పండ్లను ఎప్పుడైనా తినొచ్చు, భోజనానికి ముందైనా, తరువాతైనా!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube