2015 నందమూరి వీనుల విందే!!

నందమూరి వారసులైన బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇలా ముగ్గురు హీరోల టీసర్స్ నిన్న రాత్రి విడుడదవుతాయి అన్న వార్త విని అభిమానులు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూడగా.

వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ తమ మూవీ టీసర్ ను విడుదల చేసేసారు.

ఇంకేముంది.అందరూ ఊహించిన విధంగానే బాలయ్య ఒక డైలాగ్ తో ఎన్టీఆర్ ఒక డైలాగ్ తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.

బాలయ్య లయన్ సినిమాలో సరికొత్త సీ.బీ.ఐ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండగా, ఇక ఎన్టీఆర్ యాంగ్రీ పోలీసు పాత్రలో చెలరేగిపోవడానికి సిద్దంగా ఉన్నాడు.ఇక డైలాగ్స్ విషయానికి వస్తే లయన్ లో బాలయ్య "కొందరు కొడితే ఎక్స్-రే లో కనపడుతుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది.

కానీ నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది అని ఆవేశంగా చెప్పిన డైలాగ్, మరియు ఎన్టీఆర్ టెంపర్ లో "ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం.అదే.ఒక్కడు మీదడిపోతే.దండయాత్ర.

Advertisement

ఇది దయా గాడి దండయాత్ర" అంటూ నరాలు తెగెలా చెప్పిన డైలాగ్స్ చూస్తూ ఉంటే 2015 ఖచ్చితంగా నందమూరి అభిమానులకు వీనుల విందే అంటున్నారు విశ్లేషకులు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు