మహేష్‌, పవన్‌లనే మించి పోయింది!

అనుష్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ స్టార్‌ హీరోలకు గట్టి పోటీని ఇస్తుంది.

తాజాగా విడుదలైన ‘రుద్రమదేవి’ చిత్రంతో అనుష్క 50 కోట్లను క్రాస్‌ చేసిన విషయం తెల్సిందే.

స్టార్‌ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన 50 కోట్లను అనుష్క దక్కించుకుని అందరికి షాక్‌ ఇచ్చింది.ఇక తాజాగా ‘సైజ్‌ జీరో’ చిత్రంతో మరోసారి స్టార్‌ హీరోలకు జలక్‌ ఇచ్చింది.

ఈ సారి మహేష్‌బాబు, పవన్‌, రామ్‌ చరణ్‌ వంటి వారిని సైతం క్రాస్‌ చేసింది.అనుష్క నటించిన ‘సైజ్‌ జీరో’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో కలిసి ఏకంగా 1550 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఇప్పటి వరకు ‘బాహుబలి’ చిత్రాన్ని మినహా మరే చిత్రాన్ని ఈ స్థాయి థియేటర్లలో విడుదల చేసింది లేదు.తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ నాట కూడా భారీగా విడుదల చేయడంతో ఈ రికార్డును అనుష్క సొంతం చేసుకుంది.

Advertisement

తమిళ హీరో ఆర్య ఈ చిత్రంలో నటించడంతో పాటు అనుష్కకు తమిళనాట భారీ క్రేజ్‌ ఉంది.దాంతో ఇంత భారీ సంఖ్యలో ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేస్తున్నారు.

అనుష్క ఈ సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగిన విషయం తెల్సిందే.ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు