సినిమా టికెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.మటన్ మార్ట్ లు.

చేపలు అమ్ముకోవడం ఏమిటి.ఇంక సినిమా టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇటువంటి తరుణంలో విపక్షాలు చేస్తున్న కామెంట్లపై వైసిపి మంత్రి పేర్ని నాని స్పందించారు.కావాలని విపక్ష పార్టీలు ప్రభుత్వం సినిమా టికెట్లు అవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలో సినిమా టికెట్లను నిర్ణయించిన ధరకే ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.ఈ విషయంపై త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ అవుతారని పేర్కొన్నారు.

Advertisement

ఆగస్టు మాసంలో అదేరీతిలో మొన్న భేటీ కావాల్సి ఉండగా కుదరలేదని రాబోయే రోజుల్లో సీఎం జగన్ ఇండస్ట్రీ పెద్దల తో సమావేశం అవుతున్నట్లు వైసీపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తారీకు అనగా వచ్చే సోమవారం నాడు.

ఇండస్ట్రీ పెద్దల తో సీఎం జగన్ భేటీ చేతి ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు