మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించింది.ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.