ఇకపై హీరోయిన్ కంగనా రనౌత్ కి వై క్యాటగిరీ సెక్యూరిటీ...!

ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోటిజం కారణంగా ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి.

ఇక బాలీవుడ్ హీరో కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై ఇందుకు సంబంధించి అనేక సందర్భాల్లో విరుచుకుపడ్డారు.

అయితే తాజాగా కంగనా రనౌత్ కి మహారాష్ట్ర ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందుకు కారణం లేకపోలేదు.

కంగనా రనౌత్ ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కారణంగా ఆమె పై మహారాష్ట్ర శివసేన నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారు.ఇకపోతే ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ కు కేంద్ర ప్రభుత్వం నుండి వై కేటగిరీ సెక్యూరిటీ అందించినట్లు సమాచారం.

ఈ విషయానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రెకమెండ్ చేసింది.ఇలా చేసినందుకు కారణంగానే కేంద్ర ప్రభుత్వం కంగనారనౌత్ కి వై కేటగిరి సెక్యూరిటీ అందించడానికి సిద్ధం అవుతోంది.

Advertisement

ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చగలనా ధైర్యం కంగనా రనౌత్ ఎలా వచ్చిందని శివసేన పార్టీ కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించడం తో పాటు ఆమెను ముంబై నగరంలో అడుగు పెట్టవద్దని తెలియజేశారు.అయితే ఈ విషయంలో కంగనారనౌత్ వెనక్కి తగ్గకుండా తాను ముంబై కచ్చితంగా వస్తానని, ఎలా ఆపుతారో చూస్తానని.

సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది.ఇక ఈ నేపథ్యంలో కంగనారనౌత్ సెప్టెంబర్ 9వ తారీఖున ముంబై పర్యటనకు రానుంది.

ఈ సందర్భంగా కంగనా రనౌత్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని హిమాచల్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ తెలిపిన కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఆమె భద్రత కోసం వై కేటగిరి సెక్యూరిటీని అందించడానికి సిద్ధం అవుతోంది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు