వివాహిత గాంగ్ రేప్

గంధం లక్ష్మి (44) అనే మహిళపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హతమార్చిన సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లితండా శివారులోని సిఎంసి కళాశాల సమీపంలో నివాసం ఉంటున్నగంధం లక్ష్మి అత్యాచారం హత్య అక్కడ పెద్ద సంచలనమయ్యింది .

నిజామాబాద్ కథనం ప్రకారం నిజామాబాద్ మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన గంధం లక్ష్మి 15రోజుల క్రితం బతుకు తెరువు కోసం తన భర్త రాములుతో కలిసి నడ్‌పల్లితండాకు వచ్చింది.రోజువారీ కూలీ పనిలో చేరారు.

అక్కడే నివాసం ఉంటున్నారు.శుక్రవారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి లక్ష్మిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వెళ్ళిపోతూ రాళ్లతో తలపై బలంగా మోదడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.ఆ సమయంలో మృతురాలి భర్త ఇంట్లోనే బాగా మద్యం సేవించిన మైకంతో గాఢనిద్రలో తెలివిలేకుండా పడున్నాడు .లక్ష్మి చావు కేకలు విని రాములు తేరుకుని లేచే సరికి ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోతూ కనిపించారని చెబుతున్నాడని పోలీసులు తెలిపారు .మృతురాలిపై అత్యాచారం చేసి, హతమార్చిన ఆనవాళ్లు లభించాయి.ఇక శవ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని డిఎస్పీ చెప్పారు.

Advertisement

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

కాగా, ఈ సంఘటనలో ఆనవాళ్ళను బట్టి పోలీసులు సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు .

Advertisement

తాజా వార్తలు