సంతానం కలగలేదని శ్మశానంలో భార్యపై భర్త దారుణం..!

ప్రస్తుతం సమాజం ఒక వైపు సైన్స్ టెక్నాలజీ రోజు రోజుకు డెవలప్ అవుతుంటే, మరొకవైపు మూఢనమ్మకాలను పాటిస్తూ సమయం వృధా చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు.

ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఏదైనా పని అవడంలో ఆలస్యమైనా తాంత్రికుల, మాంత్రికల మాటలు విని విచక్షణ జ్ఞానం కోల్పోయి అడ్డమైన పనులకు పాల్పడుతున్నారు.

తాజాగా ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.నిజంగా ఇటువంటి విషయాలను కూడా నమ్ముతారా అనిపిస్తుంది కొందరిని చూస్తే.

వివరాల్లోకెళితే సంతానం కలగలేదని భార్యతో స్మశానంలో పూజలు చేపించి, అస్తిపంజరాలు, ఎముకలు తినిపించిన సంఘటన మహారాష్ట్రలోని పుణె లోని సింహగడ్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణె ధైరీ లోని సింహగడ్ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి 2019లో వివాహం జరిగింది.కొంతకాలం తర్వాత సంతానం కలగలేదని అత్తారింట్లో భర్తతో సహా అందరూ వేధించడం మొదలుపెట్టారు.ఇక ఒక మాంత్రికుడు చెప్పిన మాట విని స్మశానంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భర్తతో పాటు అత్తింటి సభ్యులు ఆమెను బలవంతంగా స్మశానానికి తీసుకెళ్లారు.

Advertisement

మాంత్రికుడు తో స్మశానంలో ఆ యువతి తో పూజలు చేయించి.అందరూ కలిసి ఎముకలు, అస్తిపంజరాలను బలవంతంగా ఆ మహిళతో తినిపించారు.మూఢనమ్మకాలతో ఎవరు ఏం చెప్తే అది చేపిస్తూ వేధింపులు ఎక్కువ అవడంతో భరించలేకపోయిన ఆ యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విస్తు పోయే నిజాలు బయట పడడంతో పాటు.భర్త, అత్తింటి సభ్యులు ఆమెను సంతానం కోసం ఎంత దారుణంగా వేధించి నరకయాతన పెట్టారో అంత బయటపడింది.

ఆ యువతి భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులను, మాంత్రికుడు తో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?
Advertisement

తాజా వార్తలు