మన్మధుడి కోసం ఇంత మంది హీరోయిన్స్‌ ఎందుకు... అసలు కథ ఏంటీ?

నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మన్మధుడు 2.ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో సమంత మరియు లక్ష్మీ ప్రసన్నలు నటిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క మరియు కీర్తి సురేష్‌లు కూడా నటిస్తున్నారట.

కథానుసారంగా ఈ చిత్రంలో వీరు కీలకంగా ఉండే గెస్ట్‌ పాత్రల్లో కనిపిస్తారని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతోంది, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం అందుతోంది.ఈ చిత్రం కథ చాలా విభిన్నంగా ఉంటుందని, ఇంత మంది హీరోయిన్స్‌ ఉండబోతున్నారు అంటే ఇది ఖచ్చితంగా సినిమా నేపథ్యం ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

సినిమా నేపథ్యం అవ్వడం వల్లే సినిమా హీరోయిన్స్‌గా రియల్‌ హీరోయిన్స్‌ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మొదటి మన్మధుడు చిత్రానికి ఈ చిత్రంకు సంబంధం ఏమీ ఉండదని సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

అయితే కథ విషయం ఏమో కాని, నాగార్జున పాత్ర మాత్రం సేమ్‌ అలాగే ఉంటుందని, అదే పేరుతో ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

దర్శకుడు రాహుల్‌ రవీంద్ర చిలసౌ చిత్రంతో మొదటి విజయాన్ని దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.ఇప్పుడు రెండవ సినిమాతో మరోసారి సక్సెస్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.నాగార్జునతో చాలా విభిన్నమైన చిత్రంను ఈయన తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు