ఫ్లై ఓవర్ బిడ్జ్‎ పై బీభత్సం సృష్టించిన కారు.. మరణించిన వీఆర్వో.. !

నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చీరాలలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

 Vro Died Due To Reckless Driving Of Car On Chirala Railway Flyover Bridge , Chir-TeluguStop.com

ఇక ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే.

చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్‎పై ఓ కారు సృష్టించిన బీభత్సంలో అతివేగం ముఖ్య కారణంగా తెలుస్తుందట.

వేగంగా వస్తున్న కారు కంట్రోల్ కోల్పోయి బిడ్జ్‎పై నుండి వెళ్లుతున్న మూడు బైక్‌లను ఢీకొట్టిందట.కాగా ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట.

ఈమేరకు ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లుగా వెల్లడించారట.

చూశారా మనిషి నిర్లక్ష్యం వల్ల బలైన ప్రాణాలను తిరిగి తీసుకు వస్తామా.ఎవరో చేసిన తప్పుకు ఓ కుటుంబం అనాధగా మారింది.ఈ విషయంలో మనుషుల్లో మార్పు ఎందుకు వస్తలేదో అసలే అర్ధం అవడం లేదు.

వేగం అనేది ఎంత ప్రమాదకరమో ఒక్క సారి ఆలోచించి ఆ ఘటనలో మిమ్మల్ని, మీకుటుంబాన్ని ఊహించుకోండి.

కాస్త ఆలోచించి నడుచుకోండని రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి ఆక్రందనట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube