వీడియో వైరల్: వేప చెట్టుకు మామిడి పండ్లు.. ఎప్పుడైనా చూసారా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ నగరంలో చోటు చేసుకున్న ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేపచెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.

ఈ సందర్భంగా ఆ చెట్టును కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియా( Social media ) ఖాతా ద్వారా షేర్ చేశాడు.ఆయన షేర్ చేసిన వీడియోలో వేప చెట్టుకు మామిడి కాయలు చాలా కనబడడం గమనించవచ్చు.

ఇక ఈ వీడియోకు ఆయన ఇవాళ నేనున్నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరికి వెళ్లి గమనించానని., అయితే చెట్టుకు మామిడి పండ్లు( Mangoes ) కనిపించడం చూసి నా మనసు పులకించిపోయిందని తెలిపాడు.కొన్నేళ్ల క్రితం ఓ ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపాడు.

కాకపోతే ఈ అద్భుతం గురించి చెప్పేందుకు ఏమాత్రం తీసుకోదంటూ ఈ వీడియోని షేర్ చేశారు.ఏంటో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ సమాచారాన్ని మంత్రి స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలపడంతో వారు వచ్చి ఆ చెట్టును పరిశీలించారు.వారు తెలిపిన సమాచారం మేరకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఆ చెట్టు వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఆ చెట్టులో ఓ మామిడి కొమ్మ కూడా ఉందని తెలిపారు.

ఫ్లైట్ ఆలస్యం అయిందని స్నాక్స్, వాటర్ ఉచితంగా ఇచ్చిన ఇండిగో..??
Advertisement

తాజా వార్తలు