వైరల్ వీడియో: వేపకాయంత వెర్రి అంటే ఇదేనేమో? దీనికోసం ఎవరైనా చిందులేస్తారా?

కొంతమంది విన్యాసాలు చూస్తే, మనకు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.అందుకే వేపకాయంత వెర్రి, పుచ్చకాయంత పిచ్చి అనే నానుడి పేరొందింది.

మనదేశంలో ఏది సమయానికి రాదు.అదేనండి.

బస్సులు, రైళ్లు అనేవి సమయాన్ని ఎప్పుడు పాటించవు.జనాలు మాత్రం ఎక్కడ మిస్ అయిపోతామేమోనని ప్లాట్ ఫామ్ మీదకు పరుగులు తీస్తూ వుంటారు.

అయినా రాదు.ఆఖరికి మెల్లగా గంటనో, అరగంటనో ఆలస్యం అని అనౌన్స్ చేసి మరీ చెబుతుంటారు.

Advertisement

మరికొన్ని సార్లు.మనం రైల్వేస్టేషన్ వెళ్లక ముందే రైలు అక్కడినుండి వెళ్లి పోతుంది.

మనమే ఏదో కారణంతో రైలును మిస్ చేసుకుంటాం.ఇపుడు ఈ తంతు ఏంటని అనుకుంటున్నారా.

అక్కడికే వస్తున్నా.వివరాలికి వెళితే, ఓ వింత ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లామ్ రైల్వేస్టేషన్ లో జరిగింది.

కొంత మంది ప్రయాణికులు బాంద్రా, హరిద్వార్ ఎక్స్ ప్రెస్ కోసం రత్లాం స్టేషన్ కు రాత్రి చేరుకున్నారు.అయితే, దాని సమయంకంటే ముందే ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

దీంతో ప్రయాణికులు ఫుల్ ఖుషీ అయ్యారు.అంటే రైలు దాదాపు అరగంట పాటు ప్లాట్ ఫామ్ మీద ఉంటుంది.

Advertisement

అరగంట ముందు ట్రైన్ వచ్చందన్నమాట.రైలులో కొంత మంది గుజరాత్ కు చెందిన ప్రయాణికులు ఉన్నారు.

వారు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ మీదకు చేరుకున్నారు.

వచ్చినవారు ఎంచక్కా గార్బా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.వారితో మరికొంత మంది కలిశారు.వీరంతా గార్బాడ్యాన్స్ చేస్తు ప్యాసింజర్ లను షాక్ కు గురిచేశారు.

ఆ తర్వాత.దీన్ని వీడియో తీసి.

కేంద్ర రైల్వే మంది అశ్విని వైష్ణవ్ కు, ఫేస్ బుక్ లో ట్యాగ్ చేశారు.దీన్ని ఆయన తన ఫేస్ బుక్ లో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఒకప్పుడు డ్యాన్స్ కోసం వేదిక, వెడ్డింగ్ కోసం చూసేవారు.

కానీ ఇప్పుడు మాత్రం డ్యాన్స్ కోసం స్పెషల్ గా పరిస్థితులున క్రియేట్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

తాజా వార్తలు