వైరల్: స్టార్ హీరోతో చిందులేసిన కేంద్ర మంత్రి..!

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అయినటువంటి అనురాగ్‌ఠాకూర్ ఓ విదేశీ వేదికపై డాన్స్ చేసారు.

పాపులర్ సాంగ్‌ మల్హరి పాటకి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ తో కలిసి డ్యాన్స్ తాజాగా స్టెప్పులేశారు.

ఓ హీరో మరో సెంట్రల్ మినిస్టర్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని అనురాగ్‌ఠాకూర్ అఫీషియల్ తన ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు.దుబాయ్‌ లో జరుగుతున్న దుబాయ్‌ ఎక్స్‌పో 2020 ఇందుకు వేదికగా మారడం విశేషం.

ఎక్స్‌పో సందర్శనకు వెళ్లిన కేంద్రమంత్రిని ఈవెంట్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు హీరో రణవీర్‌సింగ్ డ్యాన్స్ చేయమని కోరాడు.అక్కడే ఈ ఇద్దరు సెలబ్రిటీలు డ్యాన్స్ మూమెంట్ షేర్ చేసుకున్నారు.

ఇక ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రణ్‌వీర్‌సింగ్ తన హిట్ సాంగ్‌ మల్హరికి ఒక్క స్టెప్పు వేయమని కేంద్రమంత్రిని కోరారు.దాంతో ఆయన విముఖత చూపించడంతో ఆయన చేయి పట్టుకొని పలుమార్లు కోరడంతో అనురాగ్‌ ఠాకూర్‌ ఇక స్టేజ్‌పై స్టెప్పులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో మాట కాదనలేకపోయిన కేంద్రమంత్రి అతనితో కాలు కదపాల్సిన పరిస్థితి వచ్చింది.స్టెప్స్ వేయగానే రణ్‌వీర్‌సింగ్ ఆనందంతో కేంద్రమంత్రో చేతులు కలిపాడు.

దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు.దుబాయ్‌ లోని భారతీయులు భారతదేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌లని చెప్పుకొచ్చారు అనురాగ్‌ఠాకూర్.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇంత భారీగా వేడుకలు జరుగుతుండటమే దానికి నిదర్శనమన్నారు.ఇండియా ఏ విషయంలోనైనా ప్రపంచం లోనే ఓ ఉపఖండంగా మార్చడమే తన లక్ష్యమన్నారు ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్.

దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!
Advertisement

తాజా వార్తలు