వీరు దసరా తర్వాత అయినా కెమెరా ముందుకు వస్తారా?

టాలీవుడ్‌ లో ఎట్టకేలకు మళ్లీ షూటింగ్స్‌ సందడి మొదలు అయ్యింది.అయితే కొందరు స్టార్‌ హీరోలు మాత్రం ఇంకా కెమెరా ముందుకు రాలేదు.

వారు ఎప్పటి వరకు షూటింగ్‌ లో జాయిన్‌ అవుతారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.ముఖ్యంగా యంగ్‌ హీరో అయిన విజయ్‌ దేవరకొండ.

మహేష్‌ బాబు ఇంకా కొందరు మరియు సీనియర్‌ హీరోలు అయిన కొందరు కూడా షూటింగ్‌ అంటే భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది.షూటింగ్‌ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.

షూటింగ్‌ లో పాల్గొంటున్న వారు కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదని, కరోనాతోనే కొందరు వస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకే కొందరు హీరోలు షూటింగ్‌ లకు దూరంగా ఉంటేనే బెటర్‌ అన్నట్లుగా దూరం ఉంటున్నారు.

Advertisement

అయితే ఎన్నాళ్లు అని దూరం ఉంటారు.రేపు లేదా ఆ తర్వాత అయినా షూటింగ్‌ లో పాల్గొనాల్సిందే కదా.కరోనాకు భయపడి ఇప్పటికే 7 నెలలు వృధా చేశారు.ఇంకా టైం వృదా చేస్తే తమ వల్ల బతికే వారు చాలా ఇబ్బందులు పడుతారు.

అందుకోసం అయినా షూటింగ్ లకు రెడీ అవ్వాలంటూ సూచిస్తున్నారు.తెలుగు సినిమాల షూటింగ్‌ ల విషయంలో దసరా లేదా దీపావళి తర్వాత మరింత గా బిజీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వచ్చే ఏడాదిలో స్టార్‌ హీరోల సినిమాలు రావాలి అంటే ఇప్పుడే సినిమాలను ప్రారంభించాల్సి ఉంది.కాని స్టార్‌ హీరోలు కొందరు ఇంకా తమ సినిమాలను పట్టాలపైకి తీసుకు వెళ్లక పోవడంతో అసలు వచ్చే ఏడాది అయినా సినిమాలను వీళ్లు విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇద్దరు ముగ్గురు యంగ్‌ హీరోలు దసరా తర్వాత షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలని భావిస్తున్నారు.ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ మరియు విజయ్‌ దేవరకొండలు నవంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ లో పాల్గొంటారని టాక్‌ వినిపిస్తుంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు