ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ పై ఆయన కుమార్తె సంచలన వ్యాఖ్యలు.. ?

ఒకగానొక సమయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఎర్రచందన్ స్మగ్లర్ వీరప్పన్ అందరికి ఇంకా గుర్తు ఉన్నాడుగా, అవును ఎలా మరచిపోగలం.

చూపులకు కౄరంగా, బక్క పలచగా ఉన్న వీరప్పన్ ఒకప్పుడు సత్యమంగళం అడవులను ఏలిన విషయం అంత త్వరగా మరపురాదు.

ఇలాంటి స్మగ్లర్ కూతురు అయిన విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరప్పన్ అదే అడవుల్లో భారీ నిధులతో కూడిన డంప్ ను దాచి పెట్టారని వెల్లడించారు.

ఇకపోతే వీరప్పన్‌కు విద్యారాణి, విజయలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.కాగా విద్యారాణి బీజేపీలో చేరి రాజకీయాలు చేస్తుండగా, ప్రస్తుతం విజయలక్ష్మి రన్ పిళ్లై అనే బయోపిక్ లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతు.తన తండ్రి అంటే తనకెంతో ఇష్టమని, సత్యమంగళం అడవుల్లో జీవితాన్ని గడిపిన ఆయన అదే అడవుల్లో పెద్ద నిధినే దాచివుంచారని, కానీ ఈ నిధి ఎక్కడ ఉందన్న విషయం తెలిసిన వారెవరూ ఇప్పుడు బ్రతికి లేరని పేర్కొన్నారు.

Advertisement

ఇకపోతే 2004 లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు