ఓటు హక్కు నమోదు చేయించుకొండి - బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్ధండి

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఓటరు నమోదుకు సంబంధించి బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్ధండి ఆదివారం ఓ విడియో విడుదల చేశారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా అధికారులు ఓటరు నమోదుపై అవగహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపద్యంలో వేణు సొంత జిల్లా ఐన రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు తమ ఓటు హక్కను ఓటరు నమోదు కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఓటు ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత అన్నారు.ఓటు హక్కు, వినియోగంపై అవగహనా కల్పిస్తు విడియో రీలీజ్ చేసిన వేణు యెల్ధండి కి రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు.

సామాజిక బాధ్యతగా వేణు తనవంతుగా ప్రభుత్వం పరంగా నడుస్తున్న ఓటరు నమోదు కార్యక్రమానికి మద్దతు పలకడం పట్ల థాంక్స్ చెప్పారు.రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News