పంపు హౌస్ లో గుర్తుతెలియని శవం.. తెలిసిన వారు ఇలా చేయండి.. !

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం లోని కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్ లో గుర్తుతెలియని శవం లభ్యం అయినట్లు కాళేశ్వరం ఎస్ఐ నరహరి తెలిపారు.

ఈ రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్ వద్ద శవం ఉన్నట్లు పంపుహౌస్ లో పని చేసే కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్దలానికి వెళ్లిన పోలీసులు అక్కడే ఉన్న గంగపుత్రల సాయంతో శవాన్ని బయటకు తీసి పరిశీలించారు.

ఈ శవం ప్రాణహిత గోదావరి నుండి కొట్టుకొని వచ్చినట్టు ఎస్ఐ నరహరి గుర్తించారట.కాగా ఈ మృతుని వయస్సు సుమారుగా 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, చాక్లెట్ కలర్ చొక్కా కాకి కలర్ పాయింట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ మృతదేహన్ని మహదేవపూర్ ఆసుపత్రికి తరలిస్తునట్లు తెలుపుచున్న పోలీసులు, మృతుని వివరాలు ఎవరికైనా తెలిసినచో కాళేశ్వరం ఎస్ఐ గారిని 7901097045, 994994822 నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు