రియాల్టీ షో లో ఆ ఇద్దరు లేడీ యాంకర్స్

ఇటీవల సినిమాలలో,సీరియల్స్ లో పాపులారిటీ సంపాదించక పోయినప్పటికీ రియాల్టీ షో లలో పాల్గొంటే మాత్రం ఎవరైనా పాపులారిటీ ఇట్టే సంపాదించేస్తారు.

ఈ క్రమంలోనే అందరూ కూడా రియాల్టీ షో లపై పడ్డారు.

ఒక ప్రసార మాధ్యమం లో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.తొలుత బాలీవుడ్ లో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ రియాల్టీ షో కు ఎంత పాపులారిటీ వచ్చిందో, తెలుగు లో కూడా ఈ రియాల్టీ షో కు అంతే పాపులారిటీ వచ్చింది అని చెప్పాలి.

ఈ సారి ఈ షో కు స్టార్ హీరో కింగ్ నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సారి ఈ రియాల్టీ షో కోసం ఎన్నుకొనే అభ్యర్థుల విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సారి పాల్గొన బోయే పార్టిసిపెంట్స్ అందరూ కూడా దాదాపు సెలబ్రిటీలనే టాక్ వినిపిస్తుంది.మొన్నటివరకు ఈ రియాల్టీ షో లో ప్రముఖ యాంకర్స్ అనసూయ,ఉదయ భాను లు పాల్గొననున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు లేడీ యాంకర్స్ ని ఈ షో కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది.వారే శ్రీముఖి,లాస్య, వారిద్దరూ కూడా పలు టీవీ షో లలో యాంకర్స్ గా చేసి తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

వారి షో ల కారణంగా తెలుగు ప్రేక్షకులకు వారు బాగా దగ్గరయ్యారు.ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు