ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై టీఎస్ హైకోర్టు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

బీజేపీ నేత బీఎస్ సంతోష్ కు మళ్లీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొంది.వాట్సాప్, ఈ -మెయిల్ ద్వారా నోటీసులివ్వాలని న్యాయస్థానం తెలిపింది.

అదేవిధంగా బీఎల్ సంతోష్ సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ సమన్లు..!
Advertisement

తాజా వార్తలు