మాటల మాంత్రికుడు క్లబ్ లోకి వస్తున్న సూపర్ స్టార్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో సినిమాతో తాజాగా మరో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.

నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాని అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.

అయితే త్రివిక్రమ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.

ఈ రెండు సినిమాలో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న ఇప్పటికి కూడా టీవీలో ప్రసారం అయిన ప్రతి సారి ఆకట్టుకుంటూ ఉంటాయి.ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు అని వినిపిస్తుంది.

Advertisement

ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం మరో ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారు.అయితే మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అదిరిపోయే ఎంటర్టైనర్ కథాంశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుకి ఓ ఇంటరెస్టింగ్ కథ చెప్పాడని, దానికి మహేష్ కూడా గ్ర్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.మొదటి రెండు సినిమాలు తరహాలో కాకుండా ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని ఇద్దరు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అందుకే ఈ సారి డిఫరెంట్ జోనర్ ట్రై చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు