అన్నీ ఉన్నా ఈ బ్యూటీ ఎందుకో అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోతోంది...

సినిమా పరిశ్రమలోని కొంతమంది హీరోయిన్లు అందం, అభినయం, నటనా ప్రతిభకు ఉన్నప్పటికీ ఎందుకో ఒక్కోసారి అవకాశాలను దక్కించుకోవడంలో కొంతమేర విఫలమవుతుంటారు.

 దీనికితోడు ఇలాంటి వారికి తమ నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో చాలా మంది ఎంతో మంచి ప్రతిభ ఉన్నటువంటి హీరోయిన్లు మరుగున పడి పోతున్నారు.

అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినటువంటి కంచె అనే చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్  గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న జైపూర్ బ్యూటీ  ప్రగ్యా జైస్వాల్  కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా ఇప్పటి వరకు  ప్రగ్యా జైస్వాల్ తెలుగులో ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, మిర్చి లాంటి కుర్రాడు, కంచే తదితర చిత్రాలలో నటించింది.

కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినీ కెరియర్ పై పడింది.

దాంతో ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.కానీ అప్పుడప్పుడు పలు ఫొటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

Advertisement

 అంతేకాక ఈ మధ్యకాలంలో బికిని దుస్తులు కూడా ధరించి తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోంది.మరి దర్శక నిర్మాతలు ఈ అమ్మడి సిగ్నల్స్  ని అందుకుని అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు నెట్టింట్లో పలు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఇటు  ప్రగ్యా జైస్వాల్ కానీ అటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ స్పందించలేదు.దీంతో ప్రగ్యా జైస్వాల్ విరూపాక్ష చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజమెంతుందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు