టాలీవుడ్‌ లో అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ల జాబితాలో ముందు వరుసలో పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నాలు ఉంటారు.

వీరు ఇద్దరు కూడా ప్రస్తుం వరుసగా సినిమాలు చేస్తున్నారు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా వీరిద్దరు కూడా తమిళం మరియు హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు.కనుక వీరితో సినిమాలను చేసేందుకు యంగ్‌ హీరోలు సీనియర్‌ హీరోలు స్టార్‌ హీరోలు ఇలా అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.

వీరిద్దరు ప్రస్తుతం టాలీవుడ్‌ ను ఏలేస్తున్నారు అనడంలో కూడా సందేహం లేదు.వీరిద్దరి పారితోషికాల విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

టాలీవుడ్‌ లో ఇంతకు ముందు రెండు కోట్ల పారితోషికం అంటే అద్బుతం అన్నట్లుగా ఉండేది.కాని ఆ మార్క్‌ ను వీరిద్దరు చెడిపేశారు.

Advertisement

పూజా హెగ్డే తమిళం మరియు హిందీ సినిమాల్లో బిజీ బిజీగా నటిస్తోంది.ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ నుండి ఆఫర్‌ వచ్చిన సమయంలో ఈ అమ్మడు ఆలోచన లేకుండా భారీ పారితోషికంను డిమాండ్‌ చేస్తుందట.

సినిమాకు నో చెప్పడం ఇష్టం లేక నాలుగు అయిదు లక్షల ఫారితోషికాన్ని కూడా పూజా అడిగిన సందర్బాలు ఉన్నాయని అంటున్నారు.ఎక్కువ పారితోషికం అడగడం వల్ల ఆమెను ఎక్కువ మంది సంప్రదించడం లేదు.

మూడు లక్షలకు పైగా ఒక హీరోయిన్‌ కు ఖర్చు చేస్తే మీడియం బడ్జెట్‌ సినిమా లను తీయడం కష్టం అంటూ నిర్మాతలు వాపోతున్నారు.అందుకే పూజా హెగ్డే చిన్న సినిమాలకు తక్కువ డేట్లు ఇచ్చి అయినా కోటి రూపాయలకు ఒప్పుకోవాలంటున్నారు.

సినిమా ఎంతదైనా ఎన్ని రోజుల డేట్లు అయితే అన్ని రోజులకు గాను ఖచ్చితంగా పూర్తి పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ పూజా డిమాండ్‌ చేస్తుందట.టాలీవుడ్‌ లో ప్రస్తుతం అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌ గా ఈ అమ్మడు నిలిచింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మూడు నుండి నాలుగు కోట్ల వరకు ఈమె తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు