పాపం... హీరోయిన్ తండ్రిని బెదిరించి....

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు సినీ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించినటువంటి "వాన" అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ మీరా చోప్రా తన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే తాజాగా మీరా చోప్రా తండ్రి ని కొందరు వ్యక్తులు బెదిరించి అతడి నుంచి ఫోన్ దొంగిలించినట్లు మీరా చోప్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి మీరా చోప్రా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో నివాసం ఉంటోంది.

కాగా మీరా చోప్రా తండ్రి తెల్లవారు జామున వాకింగ్ చేయడం కోసం బయటకు వెళ్లడంతో నిర్మానుష్య ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి అతడి నుంచి ఖరీదైన మొబైల్ ఫోన్ ని దొంగిలించినట్లు తెలిపింది.అంతేగాక తన తండ్రిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో తాజాగా ఢిల్లీ పోలీసులు స్పందించారు.ఇందులో భాగంగా తొందర్లోనే తన తండ్రిని బెదిరించి దొంగతనానికి పాల్పడిన టువంటి వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ అమ్మడు టాలీవుడ్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున, నితిన్, తదితర స్టార్ హీరోలతో నటించింది.అంతేగాక ఈ అమ్మడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో 20కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అయినప్పటికీ తెలుగులో మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.అంతేగాక సినీ కెరియర్ లో సరైన హిట్ లేక పోవడంతో సినీ పరిశ్రమలో తనకంటూ సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

 .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు