అమెరికాలో రోడ్డు ప్రమాదం! ముగ్గురు ఎన్నారైల మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన ముగ్గురు ఎన్నారైలు అక్కడికక్కడే మృతి చెందారు.

వీరు ప్రయాణిస్తున్న కారుని వెనుక నుంచి ఒక ట్రక్కు వేగంగా వచ్చి కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు.

వివరాలలోకి వెళ్తే హైదరాబాద్ ముషీరాబాద్‌లోని జగదాంబ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఆవుల గౌతమ్‌, శివలీల దంపతుల కుమార్తె దివ్యకి 2007లో మలేషియన్‌ టౌన్‌షిప్‌కు చెందిన రాజా గవినితో వివాహం జరిగింది.వారు పెళ్లి తర్వాత అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.

వీరు డల్లాస్‌లోని ఫ్రిస్కోలో ఉంటున్నారు.వీరి ఏడేళ్ల పాపని డాన్స్‌ క్లాస్‌లో వదిలి సొంతింటి ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజా దంపతులు మిత్రుడు ప్రేమ్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ ట్రక్కువేగంగా దూసుకొచ్చి కారుని డీకొట్టింది.దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

రాజా, దివ్య దంపతులది హైదరాబాద్ కాగా, ప్రేమ్ గుంటూరుకు చెందిన వ్యక్తి.దివ్య అమెరికాలోని నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేస్తుండగా.

రాజా, ప్రేమ్‌ వెల్స్‌ఫార్గోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.ఈ ప్రమాదం కారణంగా ఇప్పుడు రాజా, దివ్య దంపతుల కూతురు తల్లిదండ్రులని కోల్పోయి అనాధగా మారింది.

ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు అమెరికా బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తుంది.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు