ఆ కారణంగా ప్రభాస్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న అనుష్క... 

టాలీవుడ్ లో గత సంవత్సరంలో ప్రముఖ కుర్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి "సాహో" అనే చిత్రం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.

ఈ చిత్రంలో హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవెలిన్ శర్మ, జాకీ శ్రాఫ్, మురళి శర్మ, నీలి నితీష్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయినా వసూళ్ల విషయంలో మాత్రం మంచి లాభాల పంట పండించింది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నృత్యం చేసినటువంటి బ్యాడ్ బాయ్ సాంగ్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ పాటలో నటించేందుకు అప్పట్లో దర్శకుడు సూజిత్ ముందుగా టాలీవుడ్ స్వీటీ అనుష్క ని సంప్రదించారట.కానీ ఆమె తేదీలు ఖాళీ లేకపోవడంతో అందుకు స్వీటీ నో చెప్పినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి మిర్చి, బాహుబలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.అందువల్లనే దర్శకుడు సుజిత్ సాహో చిత్రంలో అనుష్క ని నటింపజేయడానికి ప్రయత్నించినా కుదరలేదని పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి తెలుగు తమిళం భాషల్లో తెరకెక్కుతున్నటువంటి "నిశ్శబ్దం" అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మించారు.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు