గ్లామర్ డోస్ పెంచిన శృతి హాసన్.. అందుకేనట....

తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన "గబ్బర్ సింగ్" అనే చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న "కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మొదట్లో అవకాశాలని దక్కించుకోవడంలో బాగానే  శ్రమించింది.

 కానీ గబ్బర్ సింగ్ చిత్రం మంచి హిట్ కావడంతో ఈమె సినీ కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది.  దీంతో ఈ అమ్మడు దాదాపుగా తెలుగు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  వెలుగొందింది.

 కానీ అనుకోకుండా ప్రేమలో పడి బ్రేకప్ కూడా అవ్వడంతో దాదాపుగా మూడేళ్లుగా సినిమా పరిశ్రమకు దూరం అయింది.అయితే ఈ మధ్య కాలంలో శృతి హాసన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

 ఈ క్రమంలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తాజాగా బికినీ దుస్తులలో తీసుకున్న ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ మధ్య కాలంలో శృతిహాసన్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోసు పెంచిందని కామెంట్లు చేస్తున్నారు.దీనికి తోడు దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ అమ్మడికి పెద్దగా సినిమా అవకాశాలు లేవు.

 దీంతో సినిమా ఆఫర్ల కోసం కూడా కొంతమేర బోల్డ్ షో చేస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా శృతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న "క్రాక్" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు