స్పెయిన్ నుంచి ముంబై కి మకాం మార్చిన తెలుగు హీరోయిన్.... అందుకేనా..?

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, తదితర స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ "శ్రియా శరణ్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా నటి శ్రియా శరణ్ తెలుగులో దాదాపుగా 100కి పైగా హీరోయిన్ గా నటించింది.

అయితే శ్రియా శరణ్ ఆ మధ్య రష్యా దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత తన భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది.

కానీ అప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని పలు చిత్రాలలో నటించే అవకాశాలు రావడంతో అప్పుడప్పుడూ సినిమా షూటింగ్ నిమిత్తం భారతదేశానికి వచ్చి వెళుతూ ఉండేది.అయితే ఇటీవలే శ్రియా శరణ్ పుట్టిన రోజు కావడంతో తన భర్తతో కలిసి తిరుపతిలోని వెంకటేశుడి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.

అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని విలాసవంతమైన ఇల్లు ని అద్దెకు తీసుకుని కొంత కాలం పాటు ఇక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అయితే గత కొద్ది కాలంగా శ్రియా శరణ్ తన భర్తతో కలిసి స్పెయిన్ లో ఉండటంతో సినిమా షూటింగులకు హాజరయ్యే విషయంలో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Advertisement

అందువల్లనే నటి శ్రియా శరణ్ స్పెయిన్ నుంచి ముంబై కి మకాం మార్చినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియా శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ఆర్ఆర్" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే "గమనం" అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు