ఇక్కడ కంటే సునీల్‌ కు అక్కడే ఎక్కువ ఇస్తున్నారట

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్ గా సుదీర్ఘమైన జర్నీ కొనసాగించిన సునీల్ అందాల రాముడు సినిమా తో హీరోగా మారిన విషయం తెలిసిందే.

రాజమౌళి సినిమా మర్యాద రామన్న తో సునీల్ కి హీరో గా మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సునీల్ వరుసగా హీరోగా నటిస్తూ సినిమాలు చేశాడు.హీరో గా చేస్తున్న సినిమాలు కొంత కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ ఉండటంతో తెలివిగా వెంటనే మళ్ళీ కామెడీ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు.

మునుపటి మాదిరిగా సునీల్‌ మళ్లీ కమెడియన్ గా నెంబర్ 1 స్థానానికి చేరుకుంటాడని అంతా భావించారు.కానీ కమెడియన్ గా కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా.విలన్ గా సునీల్ ఎక్కువగా అలరిస్తున్నాడు.

ఒక కమెడియన్ సీరియస్ విలన్ గా అలరించడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం.పుష్ప సినిమా లో మంగళం శ్రీను పాత్ర లో సునీల్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.అందుకే ఇప్పుడు వరుసగా ఆయనకు విలన్ పాత్రలు వస్తున్నాయి.

Advertisement

తమిళం లో సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా లో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

అంతే కాకుండా విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇంకా మూడు నాలుగు తమిళ సినిమాల్లో కూడా సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి తెలుగు లో కంటే కూడా తమిళనాట సునీల్ బిజీగా ఉన్నాడు.

అంతే కాకుండా తెలుగు లో తీసుకుంటున్న పారితోషికం తో పోలిస్తే తమిళ సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం ఎక్కువ అనే ప్రచారం కూడా జరుగుతుంది.మొత్తానికి సునీల్ తెలుగు లో సత్తా చాటి ఇప్పుడు తమిళం లో దూసుకు పోవడం పట్ల ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు