బిగ్ బాస్ పై పడ్డ శ్రీ రెడ్డి... అదంతా ఫేక్ అంట...

సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.

ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో శ్రీ రెడ్డి ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి అందుబాటులో ఉంటోంది.

అయితే నటి శ్రీ రెడ్డి తన అభిమానులతో ఇటీవలే చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో కొందరు నెటిజన్లు  అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలో ఈ అమ్మడు బిగ్ బాస్ షో పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో ముఖ్యంగా బిగ్ బాస్ షోలో చూపించేది అంతా ఫేక్ అని అంతేగాక ఆ షోలో నటీనటుల తీరు షో నిర్వాహకుల డైరెక్షన్ లో ఉంటుందని అలాంటప్పుడు రియాల్టీ గేమ్ షో అని ఎలా అంటారని అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

అంతేగాక తనకే గనక అవకాశం వస్తే కచ్చితంగా ఈ షో గురించి నిజా నిజాలు బయటపెట్టిన దాన్నే అని తెలిపింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ గతంలో శ్రీ రెడ్డి బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమెకి అవకాశం రాకపోవడంతో ఇలా తన అక్కసును వెళ్లగక్కారని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేయడం నటి శ్రీరెడ్డి కొత్తేమీ కాదు.గతంలో కూడా పలువురు టాలీవుడ్  సెలబ్రిటీల పై తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా విరుచుకు పడింది.

 ఈ విషయం ఇలా ఉండగా గత మూడు సీజన్లలో బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలు పాల్గొనడంతో ప్రేక్షకులకి బాగానే ఆసక్తి ఉండేది కానీ ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారికి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో కొంతమేర ఈ సీజన్ కి ఆదరణ కరువయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు