తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఫలితంపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మునుగోడు రిజల్ట్ లౌకిక శక్తులకు ఊతం ఇచ్చిందన్నారు.

ఈ ఉపఎన్నిక రాజకీయ పార్టీలకు ఒక పాఠమని తెలిపారు.ఉపఎన్నికకు వెళ్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ ఆత్మహత్య చేసుకుంటున్నారని ముందే చెప్పానని వ్యాఖ్యనించారు.

మరికొన్ని ఉపఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.ఉపఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం వద్ద పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు.

చాలా రంగాల్లో దేశం వెనుకబడిపోయిందని వెల్లడించారు.సరైన ప్రత్యామ్నాయం లేక మోదీ అధికారంలో ఉన్నారన్నారు.

Advertisement

కేసీఆర్ వంటి నాయకులను జాతీయ స్థాయిలో బలపర్చాలని సూచించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు