తెలంగాణ ఎన్నికల టీం సిద్ధం చేస్తున్న బీజేపీ అధిష్టానం..!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఇప్పటినుంచే గెలుపు దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల టీమ్ ను బీజేపీ అధిష్టానం సిద్ధం చేస్తుంది.

ఈ మేరకు ప్రధాన కార్యదర్శులతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, శివప్రకాశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై చర్చిస్తున్నారని సమాచారం.

దాంతో పాటు సంజయ్ టీమ్ లో ఎవరెవరు ఉండాలనే దానిపై కూడా చర్చ కొనసాగుతోంది.అదేవిధంగా యాక్టివ్ టీమ్ ను కూడా సిద్ధం చేయాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోందని తెలుస్తోంది.

మరోవైపు నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు హైకమాండ్ కు రిపోర్టులు చేరుతున్నాయి.

Advertisement
అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు