తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress Party ) జెండాను ఎగరవేయాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ క్కు మరింతగా బలం పెరిగిందని , బీ ఆర్ ఎస్, బిజెపిలోని కీలక నేతలు చేరడంతో పార్టీ మరింతగా బలోపేతం అయిందని, జనాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై( BRS ) తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే కేంద్ర బిజెపి పైన( BJP ) ఉన్న ఆగ్రహం తెలంగాణ బిజెపిపై స్పష్టంగా ఉంటుందని, ఇవన్నీ తమకు కలిసి వస్తాయనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.
అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని స్క్రీనింగ్ కమిటీ ద్వారా వడబోత చేపట్టారు.
![Telugu Aicc, Congress, Congressmla, Muralidharan, Muralidaran, Pcc, Telangana-Po Telugu Aicc, Congress, Congressmla, Muralidharan, Muralidaran, Pcc, Telangana-Po](https://telugustop.com/wp-content/uploads/2023/10/telangana-congress-party-to-release-first-phase-list-of-assembly-elections-candidates-detailss.jpg)
దాదాపు చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం( Central Election Commission ) ముగిసిన నేపథ్యంలో ఈరోజు ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి.ఇంకా కాంగ్రెస్ లోకి చేరికలు వచ్చే అవకాశం ఉండడంతో, మరికొన్ని రోజులు తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.
![Telugu Aicc, Congress, Congressmla, Muralidharan, Muralidaran, Pcc, Telangana-Po Telugu Aicc, Congress, Congressmla, Muralidharan, Muralidaran, Pcc, Telangana-Po](https://telugustop.com/wp-content/uploads/2023/10/telangana-congress-party-to-release-first-phase-list-of-assembly-elections-candidates-detailsa.jpg)
ఈనెల 18న ఆ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదైనా కారణాలవల్ల జాబితా విడుదల ఆలస్యమైన , అవి ఒకటి రెండు రోజుల తర్వాత విడుదలవుతుందని , ఈనెల 20 లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఏఐసిసి వర్గాలు పేర్కొన్నాయి.అభ్యర్థుల ప్రకటన అంశంలో కీలకంగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్( Muralidharan ) క్లారిటీ ఇచ్చారు. 58 మందితో తొలి జాబితా ఆదివారం విడుదలవుతుందని స్వయంగా ఆయన ప్రకటించడంతో ఆశావాహులు జాబితా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.