హనుమకొండలో టిడిపి నాయకుడి దారుణ హత్య.. ?

మనిషిని మలీనం చేస్తుంది ఏంటంటే పగ, ప్రతీకారం.ఇవి ఒక్క సారి మనస్సులోకి ప్రవేశించాయంటే తమ పంతం నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది.

మనిషిలోని జ్ఞానాన్ని చంపేసి, విచక్షణ కోల్పోయేలా చేసి, తాను ఏం చేస్తున్నాడో తెలియని స్దితిలోకి తీసుకెళ్లుతుంది.ఫలితంగా ఒక మనిషిని దారుణంగా చంపడమో, తాను చావడమో చేస్తాడు ఈ స్దితిలో ఉన్న మనిషి.

ఇకపోతే ఇలాంటి హత్యే ఒకటి హనుమకొండలో జరిగింది.ఆ వివరాలు చూస్తే.

హనుమకొండలోని హైదరాబాద్ జాతీయ రహదారి పై, జనగామ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదురుగా, టిడిపి నాయకుడు, మాజీ కౌన్సిలర్ పులి స్వామీ (54) దారుణ హత్యకు గురయ్యారు.మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఆయనను మాటు వేసిన అగంతకులు హత్య చేసి పరారయ్యారు.‌‌

Advertisement

ఇక హంతకులు వాడిన బైక్ కూడా అక్కడే వదిలేసారు.కాగా హత్యా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే గత కొంత కాలంగా పులి స్వామికి భూ వివాదలు ఉన్నట్లు తెలుస్తొందని, హత్యచేసిన హంతకులను తగిన ఆధారాలతో త్వరలోనే పట్టుకుంటాం అని ఏసిపీ వినోద్ కుమార్ వెల్లడించారు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు