సంచలన విషయాలు వెల్లడించిన సుశాంత్ సోదరి!

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో సీబీఐ అధికారుల విచారణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖ్యంగా సుశాంత్ సింగ్ డిప్రెషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.సుశాంత్ కుటుంబ సభ్యులు బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు తమకు తెలియదని చెప్పారు.

అయితే తాజాగా సుశాంత్ కుటుంబ సభ్యులు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని వాళ్లు కావాలనే అబద్ధాలు చెబుతున్నారని వెల్లడైంది.సుశాంత్ సోదరి నీతూ సింగ్ ముంబై పోలీసులకు వెల్లడించిన విషయాలు, లీక్ అయిన వాట్సాప్ చాట్ ద్వారా సుశాంత్ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేవాడని తేలింది.

నీతూ సింగ్ సుశాంత్ ఏడేళ్ల క్రితమే మానసిక సమస్యలతో బాధ పడుతూ సైకియాట్రిస్ట్ ను కలిశాడని చెప్పారు.గతేడాది అక్టోబర్ నెలలో తనతో లోన్లీగా ఫీల్ అవుతున్నానని సుశాంత్ చెప్పాడని.

Advertisement

కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ వల్లే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడని అన్నారు. హిందూజా ఆస్పత్రిలో పని చేసే డాక్టర్ కెర్సీ చౌడా దగ్గర గతేడాది నవంబర్ నుంచి సుశాంత్ చికిత్స తీసుకున్నాడని పేర్కొన్నారు.

చనిపోవడానికి కొన్ని నెలల ముందు సుశాంత్ ను కలవగా తనకు బోర్ కొడుతుందని కొన్ని రోజులు అక్కడే ఉండాలని సుశాంత్ కోరాడని చెప్పుకొచ్చారు.సుశాంత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు తన ఇంటికి వెళ్లిపోయానని తాను సుశాంత్ కు కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై రాలేదని.

సుశాంత్ సూసైడ్ కు గల కారణాలు తమకు కూడా అంతుచిక్కడం లేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు