తెలుగు సినిమా పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి.ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెంకటేష్ హీరోగా ఉండగా రానా కూడా హీరో అయ్యాడు.
ఇక సురేష్బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరో అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అభిరామ్ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
హీరో అవుతాడు అనుకుంటున్న సమయంలో శ్రీరెడ్డి ఇష్యూతో అతడి సినీ కెరీర్ మొదలు కాకుండానే గందరగోళంలో పడిపోయింది.
నిన్న రామానాయుడు జయంతి సందర్బంగా ఫిల్మ్ నగర్లోని ఆయన విగ్రహంకు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్బంగా ఆ కార్యక్రమంలో అభిరామ్ హాజరు అయ్యాడు.తాత గారితో తన జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.తాతయ్య బతికి ఉంటే నేను ఇప్పటి వరకు హీరోను అయ్యేవాడిని అంటూ అభిరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
తండ్రి సురేష్ బాబు హీరో అవ్వాలనుకుంటున్న అభిరామ్ను అడ్డుకుంటున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ఇష్యూ కారణంగా హీరో అయినా మరింత వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తారని, దాంతో పరువు పోతుందని సురేష్ బాబు ఆలోచిస్తున్నాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే కొడుకుపై అభిమానం ప్రేమ ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో హీరో అవ్వకుండా అడ్డుకుంటున్నాడు అంటూ సినీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.