మొబైల్ ఫోన్ కోసం పసిపాపను బలిచ్చారు

మూఢనమ్మకం అనాలో మూర్ఖత్వం అనాలో, అమాయకత్వం అనాలో, అనాగరికత అనాలో, 2016 సంవత్సరపు చివరి అంచులో కూడా బలి అంటు బలిదానం అంటూ అమానవీయ చర్యకు పాల్పడుతున్నారు.

ఇంకా మంత్రాలు ఉన్నాయనే వెర్రితనంతో, ఈ ప్రపంచంలో మనుషులు ఎంత దారుణంగా ఉంటారో ఇంకా సరిగా తెలియని ఓ పసిహృదయాన్ని ఆపేసారు.

అతిదారుణంగా చంపేశారు.మంత్రాలంటూ బలి ఇచ్చారు.

ఇక బలి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు మరింతగా ఆశ్చర్యపోతారు.అస్సాంలోని చారైడియో జిల్లాలోని రత్నాపూర్ లో ఓ గిరిజన తండా ఉంది.

అక్కడ నివసిస్తున్న హనుమాన్ భూమీజ్ కూతురు సెల్ ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది.దాంతో ఆ ఫోన్ వెతకడం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు హనుమాన్.

Advertisement

ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు.ఆ మహానుభావుడు చెప్పిన ఉపాయం ఏంటో తెలుసా? ఎవరైనా చిన్నారని బలి ఇస్తే మొబైల్ లభింస్తుందని చెప్పాడట ఆ మాటలు పట్టుకొని, హనుమాన్, అతని తమ్ముడు ఓ నాలుగేళ్ళ పాపని కిడ్నాప్ చేసి మంత్రగాడి సమక్షంలో బలి ఇచ్చారు.స్థానికులు గమనించేసరికి అసలు విషయం బయటపడింది.

దాంతో గ్రామప్రజలు హనుమాన్ ని, అతడి సోదరుడిని చితకబాది పోలీసులకి అప్పగించారు.ఇక ఆ మంత్రగాడు అబ్దుల్ జలీల్, అతని సహచరుడు, ఇద్దరూ పరారిలో ఉన్నారు.

పోలీసులు వారి ఆచూకి వెతికే పనిలో పడ్డారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు