మూఢనమ్మకం అనాలో మూర్ఖత్వం అనాలో, అమాయకత్వం అనాలో, అనాగరికత అనాలో, 2016 సంవత్సరపు చివరి అంచులో కూడా బలి అంటు బలిదానం అంటూ అమానవీయ చర్యకు పాల్పడుతున్నారు.
ఇంకా మంత్రాలు ఉన్నాయనే వెర్రితనంతో, ఈ ప్రపంచంలో మనుషులు ఎంత దారుణంగా ఉంటారో ఇంకా సరిగా తెలియని ఓ పసిహృదయాన్ని ఆపేసారు.
అతిదారుణంగా చంపేశారు.మంత్రాలంటూ బలి ఇచ్చారు.
ఇక బలి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు మరింతగా ఆశ్చర్యపోతారు.అస్సాంలోని చారైడియో జిల్లాలోని రత్నాపూర్ లో ఓ గిరిజన తండా ఉంది.
అక్కడ నివసిస్తున్న హనుమాన్ భూమీజ్ కూతురు సెల్ ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది.దాంతో ఆ ఫోన్ వెతకడం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు హనుమాన్.
ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు.ఆ మహానుభావుడు చెప్పిన ఉపాయం ఏంటో తెలుసా? ఎవరైనా చిన్నారని బలి ఇస్తే మొబైల్ లభింస్తుందని చెప్పాడట ఆ మాటలు పట్టుకొని, హనుమాన్, అతని తమ్ముడు ఓ నాలుగేళ్ళ పాపని కిడ్నాప్ చేసి మంత్రగాడి సమక్షంలో బలి ఇచ్చారు.స్థానికులు గమనించేసరికి అసలు విషయం బయటపడింది.
దాంతో గ్రామప్రజలు హనుమాన్ ని, అతడి సోదరుడిని చితకబాది పోలీసులకి అప్పగించారు.ఇక ఆ మంత్రగాడు అబ్దుల్ జలీల్, అతని సహచరుడు, ఇద్దరూ పరారిలో ఉన్నారు.
పోలీసులు వారి ఆచూకి వెతికే పనిలో పడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy