రూపాయికే దోశ.. రుచి మాత్రం అదుర్స్.. రజనీకాంత్ కోసమేనట!

ఈ రోజుల్లో రూపాయికి ఏం వస్తుంది అని ప్రశ్నిస్తే.ఆలోచించాల్సిన పరిస్థితి.

టీ, కాఫీ ధరలు కూడా పది రూపాయల పై మాటే ఉంటున్నాయి.

ఇక టిఫిన్లు ధరలు దాదాపు 50 రూపాయల వరకు ఉంటున్నాయి.

పెరుగుతున్న నిత్యావసర ధరలు వల్ల అన్ని రేట్లు భగ్గుమంటున్నాయి.ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి మాత్రం కేవలం రూపాయికే రుచికరమైన దోశలు అందిస్తున్నాడు.

అయితే అతడు రజనీకాంత్ రీసెంట్ సినిమా హిట్ కావాలనే రూపాయికి దోశలు విక్రయిస్తున్నాడట.రజనీ హీరోగా నటించిన అన్నాత్తె (తెలుగులో పెద్దన్న) సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

అయితే తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలోని కర్ణన్ అనే హోటల్ యజమానికి రజనీకాంత్ అంటే చాలా ఇష్టం.అందుకే అతను అన్నాత్తె సినిమా హిట్ కావాలని ప్రార్థిస్తూ కస్టమర్లకు రూపాయికే దోశలు ఆఫర్ చేస్తూ వారి కడుపు నింపుతున్నాడు.

తన హోటల్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ సినిమా హిట్ కావాలని కోరుకోమంటున్నాడు.రూపాయికే దోశలు అని బంపర్ ఆఫర్ ప్రకటించడంతో అక్కడి స్థానిక ప్రజలందరూ హోటల్‌కు పోటెత్తుతున్నారు.

జై అన్నాత్తె, జై రజనీకాంత్ అంటూ హోటల్‌లో దోశలు లాగించేస్తున్నారు.

అయితే ఈ హోటల్ గురించి స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా వార్తలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా కర్ణన్ హోటల్ యజమాని మాట్లాడుతూ.తన హోటల్‌కు ప్రజలు ఎలా వస్తున్నారో.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అన్నాత్తె సినిమాకు కూడా అలానే వెళ్లాలని తాను కోరుకున్నట్లు చెప్పాడు.సినిమా సూపర్ హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటూ.రూ.1కే కస్టమర్లకు కడుపునిండా ఆహారం అందించాలని తాను నిర్ణయించినట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని దీనివల్ల రజనీకాంత్ సినిమా విజయం పై ప్రభావం పడుతుందని.కానీ అలా కాకుండా అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా సూపర్ హిట్ చేయాలని కర్ణన్ కోరుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం ఈ హోటల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.చాలామంది అతడి అభిమానాన్ని మెచ్చుకుంటూనే.

పేదల ఆకలి తీరుస్తున్న అతని దాతృత్వాన్ని పొగుడుతున్నారు.

తాజా వార్తలు