పుష్ప 2 తరువాత ఆ హీరోని లైన్ లో పెట్టిన సుకుమార్?

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2(Pushpa 2).

అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే సుకుమార్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా తర్వాత సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda)ను డైరెక్ట్ చేయబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి అసలు ఏ విధమైనటువంటి వార్తలు వెలువడలేదు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.తాజాగా పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ మరొక హీరోని లైన్ లో పెట్టారని ఇండస్ట్రీ టాక్.

Advertisement

పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సుకుమార్ మరొక స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ ( Prabhas ) తో సినిమా చేయబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇప్పటికే నాలుగు ఐదు సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సుకుమార్ తో కూడా సినిమా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.ఇక సుకుమార్ ఇదివరకే అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు