రోజురోజుకూ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని చోట్ల విపరీతంగా వర్షాలు పడటం, ఇంకొన్ని చోట్ల మాత్రం అసలు వర్షాలే పడక ఇబ్బందులు పడుతున్న ఘటనలు మనం చూస్తున్నాం.
అయితే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భూకంపాలు చోటుచేసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం.అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఓ ఘటన స్థానికులను బయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో భూమిలోంచి పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ చిత్తూరులోని ఎర్రెపల్లి, అబ్బ గుండు గ్రామాల్లో ఈరకమైన శబ్దాలు వస్తున్నాయి.ఈ రెండు ఊర్లలో భూమి కంపిస్తోందని గ్రామస్తులు విపరీతంగా భయపడిపోతున్నారు.
ఇంతకు ముందు కేవలం రాత్రి సమయాల్లోనే ఇలాంటి శబ్దాలు వచ్చేవని కానీ ఇప్పుడు పగటి పూట కూడా వస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే గ్రామంలో జరుగుతున్న ఘటనల గురించి తెలుసుకున్న ఎమ్మార్వో బెన్ రాజ్ తో పాటుగా ఎంపీడీవో నిర్మలాదేవి వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించారు.
దాదాపు 10 రోజులు గ్రామాల్లో ఇలాంటి వింత శబ్దాలు రాత్రిపూట వినిపించేవని, కానీ ఇప్పుడు పగటి సమయంలో కూడా రావడం గురించి వివరించారు.చాలామంది ఇండ్లలోని గోడలు బీటలు వారుతున్నాయంటూ వారు వివరించారు.
అయితే ఇందుకు కొన్ని కారణాలను గ్రామస్తులు చెబుతున్నారు.గ్రామాల పక్కనే జరుగుతున్న మైనింగ్ పనులతోనే ఇలాంటివి జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు.
కాగా మైనింగ్ ఏడి ప్రకాష్ కుమార్ వచ్చి శబ్దాలను పరిశీలించారు.గ్రామస్తులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే దీనిపై గ్రామస్తులు మాత్రం కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.తమ ఊరుకు ఎలాంటి హానీ జరగకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy