స్టార్ హీరో అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం.. అక్కడ బన్నీ మైనపు విగ్రహం కొలువుదీరనుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )కు ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది.అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా( Pushpa The Rise movie ) ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఈ సినిమాలోని బన్నీ నటనకు ఏకంగా నేషనల్ అవార్డ్ ( National Award )వచ్చింది.

పుష్ప2 సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కడం గమనార్హం.

ప్రభాస్, మహేశ్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే కావడం గమనార్హం.మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో( Madame Tussauds Museum ) మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం గొప్ప గౌరవం అని భావిస్తారు.

గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే ఈ మ్యూజియంలో చోటు దక్కేది.అయితే ఈ మధ్య కాలంలో సౌత్ హీరోలు సైతం ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement

టాలీవుడ్ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ కు ఈ అరుదైన ఘనత దక్కుతోంది.ప్రభాస్, మహేశ్ మైనపు విగ్రహాలు ఇప్పటికే అక్కడ కొలువై ఉండగా బన్నీకి కూడా ఇక్కడ స్థానం లభించిందనే వార్త ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ త్వరలో లండన్ వెళ్తున్నారని వచ్చే ఏడాది ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన మూడో హీరో అల్లు అర్జున్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.పుష్ప2 సినిమా వచ్చే ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.సుకుమార్ ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు