సినీ హీరో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై రేపు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.అయితే హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో హీరో నవదీప్ ఏ29 గా ఉన్నాడంటూ పోలీసులు పేర్కొన్నారు.అయితే దీనిపై తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన నవదీప్ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలోనే నవదీప్ విన్నపంపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.కాగా మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు రామచంద్ర అనే వ్యక్తి నవదీప్ కూడా తనతో కలిసి డ్రగ్స్ సేవించాడని తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.