సరిలేరు నీకెవ్వరుని మలుపుతిప్పే కొండారెడ్డి బురుజు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ మరో లెవెల్‌లో ఉంటుందని, చిత్ర యూనిట్ మొదట్నుండీ చెప్పుకుంటూ వచ్చింది.

ఈ సినిమాలో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ నటిస్తోండగా కొన్ని కారణాల వల్ల రాయలసీమకు వస్తాడు.అయితే ఇక్కడ జరిగే పరిణామాల్లో భాగంగా సినిమాలో ఓ అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద జరిగే సీన్‌తో మైండ్‌ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని తెలుస్తోంది.అనిల్ రావిపూడి కథ విషయంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఇవ్వాలో అదే విధంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగి పెద్ద సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది.

Advertisement

ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

జాతి రత్నాలు సినిమా చేయను అని చెప్పాను : ఫరియా 
Advertisement

తాజా వార్తలు