రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక మృతి - దుఃఖ సముద్రంలో తల్లిదండ్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సరిహద్దులో ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కారు సిరిసిల్ల నుండి ఎల్లారెడ్డిపేట వైపు వస్తున్న క్రమంలో గాజుల పల్లె వద్ద ఆరేళ్ల బాలిక రోడ్డు దాటుతున్న క్రమంలో ఢీకొట్టగా బాలిక కొట్టెం స్వాతి 6 తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ సంఘటన స్థలానికి వెళ్లి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతి చెందిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బాలిక కేశ సముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ రామారావు కూతురు అని తెలిసింది.సమీప బంధువులు గాజుల పల్లెలో నివసిస్తున్నందున ఆదివారం గాజుల పల్లె గ్రామానికి వచ్చినట్లు సమాచారం కూతురు మృతి చెందడం పట్ల ఆ తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News