అలా ఫేమ్ వచ్చిందో లేదో... ఇలా డైరెక్టర్ తో దురుసుగా ప్రవర్తించిన సిద్ధు జొన్నలగడ్డ?

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి మనందరికీ తెలిసిందే.

గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.

సిద్దు జొన్నలగడ్డ, నేహ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా ఇటీవలే ఫిబ్రవరి 12న విడుదల అయిన విషయం తెలిసిందే.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభించింది.ఈ సినిమా విడుదల అయిన తరువాత సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ మరింత పెరిగింది.

ఈ సినిమా తరువాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మంచి గుర్తింపు దక్కింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్దు ప్రస్తుతం ఆ తర్వాత సినిమాలను చేయడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

Advertisement

అయితే ఇది ఇలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డ ఇది వరకే ఒప్పుకున్న ఒక సినిమాను ఇప్పుడు చేయను అని అంటున్నారట.మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పెలా రీమేక్ లో సిద్దు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

డీజే టిల్లు సినిమాను నిర్మించిన బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది.ఈ సినిమాతో శౌరీ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఇందులో హీరోయిన్ ను కాపాడే మరొక హీరో పాత్రలో హీరో సిద్ధుని సెలెక్ట్ చేశారట.ఆ సినిమాలో రోల్ కొద్దిసేపే ఉందని, ఆ రోల్ చేయడం వల్ల ఆ తర్వాత సినిమాలపై ప్రభావం చూపిస్తుందని, ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ అలాంటి పాత్రలు చేసి తన పాపులారిటీని తగ్గుతుందేమో అని సిద్దు భయపడుతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.అందుకోసమే ముందుగానే ఒప్పుకున్న ఆ రీమేక్ సినిమా నుంచి సిద్దు తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టామని అగ్రిమెంట్ పై సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని అని సదరు డైరెక్ట్ నిలదీయడంతో, అప్పుడు ఆ డైరెక్టర్ పట్ల సిద్దు కాస్త దురుసుగా ప్రవర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు