తెలుగు హీరోయిన్ బంపర్ ఆఫర్... కేవలం రూ.200 చెల్లించి తనతో...

35 సంవత్సరాలు వయసొచ్చినా ఇప్పటికీ తన వన్నె తరగని అందంతో శ్రియా శరణ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

ఈ అమ్మడు ఒక్క తెలుగులోనే కాక కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, తదితర భాషల్లో కూడా నటించింది.

ఈ మధ్యకాలంలో పెళ్లి వయసు రావడంతో కొంతమేర సినిమాల మీద దృష్టి తగ్గించి రష్యా దేశానికి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం తన భర్త నివాసంలో కలిసి ఉంటోంది.

ఈ మధ్యకాలంలో శ్రియా శరణ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో అందుబాటులో ఉంటోంది.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ లాక్ డౌన్లోడ్ కారణంగా చాలా మంది నిరుపేదలు పూట గడవక మరియు తమ స్వగ్రామాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.అలాంటి వారికి సహాయం చేయడానికి శ్రియా శరణ్ ముందుకొచ్చింది.

Advertisement

ఇందులో భాగంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకునేందుకు పని చేస్తున్నటువంటి ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది.అలాగే తాను చేస్తున్నటువంటి ఈ కార్యంలో  తన అభిమానులు కూడా పాలుపంచుకోవాలంటూ కోరింది.

అయితే ఇందుకుగాను తనకు కేవలం 200 రూపాయలు చెల్లిస్తే తనతో కలసి డాన్స్ మరియు యోగ చేయవచ్చు అంటూ ఆఫర్ ప్రకటించింది.అంతేగాక విరాళాల ద్వారా వచ్చిన డబ్బును లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి సహాయం చేయడం కోసం ఉపయోగిస్తారని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

శ్రియా శరణ్ చేస్తున్నటువంటి ఈ మంచి పనికి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటిస్తున్నఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

 అంతేగాక శ్రియా శరణ్ తమిళం మరో మరో రెండు చిత్రాలు, హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.పెళ్లి తర్వాత కొంత మేర సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు