బీఆర్ఎస్ నాయకుడు సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది.పార్టీకి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించడంపై హైకమాండ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.అయితే నిన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా తొలగించాలని, ఆయనపై వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణ జరిపించాలని ప్రెస్ మీట్ లో కోరారు.ఈ క్రమంలోనే సమ్మిరెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసులు అందజేసింది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు