ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం ఘులక్ ఇచ్చింది.ఎక్కువ డబ్బులు దాచుకుందాం అనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది.
పీఎఫ్ ఖాతాదారులు సంబంధించి కొత్త నిబంధనలను మోదీ సర్కార్ వెల్లడించింది.ఈ నిబంధన ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలు రెండు వేరువేరు ఖాతలుగా విభజిస్తారు.తద్వారా ఆదాయం 2.5 లక్షలు దాటిన ఉద్యోగులకు పన్ను విధించేందుకు కేంద్రానికి సులభతరమవుతుంది.ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (CBDT) నీయమాల జారీ చేసింది.పీఎఫ్ ఖాతా లో ప్రత్యేక ఖాతాలు నిర్వహించబడతాయి.
ఇప్పుడు ప్రస్తుత ఉద్యోగాల పీఎఫ్ ఖాతాలు అన్నీ పన్ను పరిధిలోకి వచ్చేవి.పన్ను పరిధిలోకి రానివిగా విభజించబడతాయి.
ఈ ఏడాది మార్చి 31 లోపు పీఎఫ్ ఖాతాలో పడిన డబ్బు పన్ను రహితంగా ఉంటుంది.ఆతర్వాత కంట్రిబ్యూషన్ పై రెండు పీఎఫ్ ఖాతాలపై విడివిడిగా వడ్డీ లెక్కిస్తారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.2021-2022 పీఎఫ్ ఖాతాలు 2.5 లక్షల కన్నా ఎక్కువ సేవ్ చేస్తేనే మొత్తంపై వచ్చే వడ్డీకి వినియోగదారుడు, ఉద్యోగ పన్ను చెల్లించవలసి ఉంటుంది.