పవన్ కళ్యణ్ నిజాయితీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నరేష్

సీనియర్ హీరో, నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా రాణించిన నరేష్ తరువాత టర్న్ తీసుకొని ప్రస్తుతం స్టార్ నటుడుగా కొనసాగుతున్నాడు.

కామెడీ టైమింగ్ తో తండ్రి పాత్రలతో పాటు ఇతర పాత్రల కోసం కూడా దర్శకులు ఇప్పుడు నరేష్ ని ఫస్ట్ ఛాయస్ గా చూసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా ఎవరు స్పందించడం లేదు.అయితే వైఎస్ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉన్న నరేష్ మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై జనసేన అభిమానులు సంతోషించే కామెంట్స్ చేశారు.

ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే వంద కోట్లు వరకు ఖర్చు పెడుతున్న పరిస్థితి.అలాంటి రాజకీయాలలోకి తనుకున్న స్టార్ ఇమేజ్ ని, కోట్ల సంపాదన, ఏసీ గదులలో రాజభోగాలని వదిలేసుకొని జనం మధ్యకి వచ్చాడు.

Advertisement

అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు ప్రస్తుత రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి కచ్చితంగా అవసరం ఉంది.రాజకీయాలని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని, డబ్బు, మద్యం, కులం అనేవి లేని రాజకీయ వ్యవస్థ ఉండాలనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయాణం నాకైతే నచ్చింది.

అందుకే వ్యక్తిగతంగా ఆతనికి నా సపోర్ట్ ఉంటుంది.ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారు ఎవరైనా సిగ్గు లేని వారేనని అన్నారు.

ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయని వాటి కారణంగా కుటుంబ బంధాలు సరైన విధంగా ఉండవు, వాటిని రాజకీయాలతో ముడిపెట్టడం చూస్తుంటే వారికి పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి మారే అంశం లేదని అర్ధమవుతుందని అన్నారు.వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని ఘాటుగా చెప్పారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నరేష్ అన్న మాటలు సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకి సంతోషాన్ని ఇచ్చాయని చెప్పాలి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు