సర్కారు వారి పాటలో స్పెషల్ గెస్ట్.. ఆయన కాదండోయ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మహేష్ తన నెక్ట్స్ మూవీని కొంత గ్యాప్ తీసుకుని అనౌన్స్ చేశాడు.గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు సూపర్ స్టార్.

ఇప్పటికే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించనున్నాడు.

ఈ సినిమాను ఆర్ధిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అనేది ఆసక్తికరంగా మారింది.అయితే ఈ సినిమా కోసం పరశురామ్ కథను పక్కాగా రాసుకున్నాడని, ఇందులో సర్‌ప్రైజ్ అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ స్టార్ నటుడు కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ సినిమాలో మరో కీలకమైన పవర్‌ఫుల్ పాత్ర ఉండబోతున్నట్లు, ఇందులో ఓ పవర్‌ఫుల్ నటుడు నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో చర్చ సాగుతోంది.అయితే ఈ సినిమాలో నటించబోయే ఆ పవర్‌ఫుల్ నటుడు ఎవరా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాలో నటించే ఆ స్పెషల్ వ్యక్తి ఎవరో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు