సినీ నటి సమంత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారని చెప్పొచ్చు.మయోసైటిస్ బారిన పడిన సామ్ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కొన్ని రోజుల నుంచి మళ్లీ సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సమంత ఇన్ స్టాలో చేసిన ఓ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సామ్ సోఫాలో పడుకుని ఉండగా… పెంపుడు కుక్క ఆమె వీపుపై కాలు పెట్టి కనిపిస్తోంది.ఈ ఫోటోను షేర్ చేసిన సమంత బాధపడకు మమ్మీ.
నీకు నేనున్నాగా.! అనే క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం సామ్ పెట్టిన పిక్ చర్చనీయాంశంగా మారింది.